బైకుపై వెళుతున్న దంపతులు.. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే....

ఠాగూర్

ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (14:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. బైకుపై వెళుతున్న దంపతులను వెంటాడిన ఓ దొంగ... నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆ మహిళ మెడలోని మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడు. ఆ వెంటనే తేరుకున్న ఆ మహిళ భర్త తన బైకుతో దొంగను ఛేజ్ చేశాడు. కీసరలో స్థానికుల సాయంతో ఆ దొంగను పట్టుకుని చితకబాదారు. ఆపై స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. 
 
కీసర నుంచి యాదగిరిపల్లెకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుని బాధితురాలు చింతల పద్మ వెల్లడించారు. భర్తతో కలిసి బైకుపై వెళుతుంటే వెనుక నుంచి వచ్చిన దొంగ మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కెళ్లాడని చెప్పారు. పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు