నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

ఐవీఆర్

శుక్రవారం, 28 మార్చి 2025 (12:09 IST)
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పురితోట గ్రామంలో పరువు హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించాడన్న ఆగ్రహంతో అమ్మాయి తండ్రి యువకుడిని గొడ్డలితో అత్యంత దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది.
 
కాగా గత కొన్ని నెలలుగా పూరెల్ల సాయికుమార్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం యువతి తండ్రికి తెలిసింది. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన అతడు గొడ్డలి తీసుకుని యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేసాడు. దీనితో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పరువు హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పరితోటలో పరువు హత్య కేసులో నిందితుడు సదయ్యను చీమలపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒంటరిగా హత్య చేశాడా, ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్న పోలీసులు. https://t.co/Wt3wJxhgK9 pic.twitter.com/WDFIM9hMUN

— ChotaNews App (@ChotaNewsApp) March 28, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు