బాలికను ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం... ఎక్కడ?

ఠాగూర్

ఆదివారం, 24 ఆగస్టు 2025 (14:27 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో 17 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు కామాంధులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ బాలిక కొత్తగూడెం ఏజెన్సీలోని చర్ల మండలంలోని తన బంధువుల ఇంటికి శనివారం ఆమె వచ్చింది. ఈ క్రమంలో ఆటోలోని ఇతర డ్రైవర్లు ఆమెకు శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి ఆటోలో కిడ్నాప్ చేశారు. ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తరలించి సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక శరీరంపై గాయాలు, పంటిగాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రోహిత్ రాజు.. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు