తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో 17 యేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను కొందరు కామాంధులు ఆటోలో బలవంతంగా తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు బాధితురాలిని రక్షించి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక శరీరంపై గాయాలు, పంటిగాట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ రోహిత్ రాజు.. నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.