బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి.. భయపెట్టి.. బెదిరించి.. అత్యాచారం.. ఎక్కడ?

ఆదివారం, 12 నవంబరు 2023 (17:42 IST)
ఇద్దరు బాలికలు అత్యాచారానికి గురయ్యారు. ఈ బాలికల ఫోటోలను మార్ఫింగ్ చేసి, భయపెట్టి, బెదిరించిన కొందరు కామాంధులు ఈ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు బాలికలకు వేర్వేరుగా ఇద్దరు వ్యక్తుల నుంచి సామాజిక మాధ్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చాయి. బాలికలు అంగీకారం తెలపడంతో వారి మధ్య పరిచయం పెరిగింది. స్నేహం పేరుతో బాలికలను నమ్మించి వీడియో చాటింగ్ చేసి.. వారికి తెలియకుండా రికార్డు చేశారు. ఆ వీడియోలను నగ్నంగా ఉన్నట్టు మార్చి.. వాటిని బాలికలకు పంపించి బెదిరించారు. 
 
బహిర్గతం చేస్తామని హెచ్చరించి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల్లో ఓ బాలిక పరీక్షకు వెళ్లకుండా ఇంట్లోనే మౌనంగా ఉండటాన్ని ఆమె తల్లి గమనించి ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మరో బాలిక నుంచి కూడా ఫిర్యాదు అందడంతో నిందితులను గుర్తించి, అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. వారి నుంచి రూ.30 వేల విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు