ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

ఐవీఆర్

సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (10:42 IST)
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ మోసాలకు బలైపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం బంగారు పేటకు చెందిన ఓ తాపీమేస్త్రీ కూడా ఇలాగే ఆన్ లైన్ బెట్టింగ్ మోసానికి బలైపోయినట్లు వెల్లడించాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే.. కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్త్రీ సతీష్ ఆన్ లైన్ బెట్టింగ్ చేసాడు. ఇందులో అతడు తీవ్రంగా నష్టపోయాడు. దీనితో అతడు సెల్పీ వీడియో తీసి తమ్ముడికి పంపాడు.
 
అందులో అతడు మాట్లాడుతూ... తమ్ముడూ, ఆన్ లైన్ బెట్టింగులో బాగా నష్టపోయాను. అందుకే చనిపోవాలని అనుకుంటున్నా. అందరూ నన్ను క్షమించండి." అంటూ పేరుపాలెం బీచ్ నుంచి తమ్ముడికి సెల్పీ వీడియో పంపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

బెట్టింగ్‌తో నష్టం.. చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో..

తూర్పు గోదావరి: కొవ్వూరు మండలం బంగారుపేటకు చెందిన తాపీమేస్తీ సతీష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో నష్టపోయానని అందుకే తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు పేరుపాలెం బీచ్ వద్ద నుంచి తన తమ్ముడికి సెల్ఫీ వీడియో… pic.twitter.com/l5DN8IEbCr

— ChotaNews App (@ChotaNewsApp) February 17, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు