అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం

బుధవారం, 26 అక్టోబరు 2022 (15:55 IST)
బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన కఠిన చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ వారిపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. 
 
హైదరాబాద్ నగరంలో తాజాగా మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. డీఏవీ స్కూల్‌లో జరిగిన ఘటన మరిచిపోకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఇది సమాజంలో మహిళల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పోలీసు వర్గాల సమాచారం మేరకు.. మేడ్చల్ మల్కాజిగిరిలోని నేరేడ్‌మెట్‌లోని చిల్డ్రన్స్ హోమ్‌లో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. గ్రేస్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి నలుగురు బాలికలు తప్పించుకోగా అందులో ఇద్దరు సంగారెడ్డిలో, ఇద్దరు బాలికలు సికింద్రాబాద్‌లో ఆశ్రయం పొందడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ సమయంలో, అకౌంటెంట్ మురళి తనపై అత్యాచారం చేసాడని బాధితురాలు అధికారులకు చెప్పింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు