ఏడో తరగతి విద్యార్థినిపై బాబాయి అత్యాచారం, గర్భవతి అయిన బాలిక

ఐవీఆర్

మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (19:46 IST)
తల్లిదండ్రులు చనిపోయారని బాబాయి వద్దకు వస్తే అతడు ఆ బాలిక పట్ల కామాంధుడయ్యాడు. అతడి కామానికి ఏడో తరగతి చదివే బాలిక గర్భవతైంది. ఈ దారుణ ఘటన విజయవాడ నగర శివారులోని పాయకాపురంలో చోటుచేసుకున్నది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఆరేళ్ల క్రితం బాలిక తల్లిదండ్రులు చనిపోయారు. దీనితో ఆ బాలికను తనే చూసుకుంటానని ఆమె బాబాయి తన ఇంటికి తీసుకుని వచ్చాడు. బాలిక అక్కడే వుండి చదువుకుంటోంది. కూతురుతో సమానమైన ఆ బాలిక పట్ల అతడు కామాంధుడుగా మారాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై జరుగుతున్న దారుణాన్ని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీవ్ర అనారోగ్యంతో వున్న ఆ బాలికను పోలీసులు ఆసుపత్రికి పంపగా అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అయిందని తేల్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు