ప్రాణాలు తీసుకున్న బెంగుళూరు యువతి హత్య కేసు నిందితుడు!

ఠాగూర్

గురువారం, 26 సెప్టెంబరు 2024 (11:34 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగుళూరు యువతి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న ముక్తిరంజన్ రాయ్ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఒరిస్సా రాష్ట్రంలోని భద్రక్ జిల్లాలో ఓ గ్రామానికి చెందిన ఈ నిందితుడు బుధవారం ఓ చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హత్య తర్వాత వివిధ ప్రాంతాల్లో పర్యటించి బుధవారం స్వగ్రామం పాండికి చేరుకున్న ముక్తిరంజన్ రాయ్.. బుధవారం ఇంటిలోనే ఉన్నడు. ఆ తర్వాత బైకుపై వెళ్లి ప్రాణాలు తీసుకున్నట్టు స్థానికులు తెలిపారు. 
 
బెంగళూరులో మహాలక్ష్మి (26) అనే యువతిని కిరాతకంగా హత్య చేసి ముక్కలుగా నరికి, ఫ్రిజ్‌లో ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడి కోసం ఒడిశా, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో ప్రధాన నిందితుడు ముక్తిరంజన్ రాయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 
బెంగళూరులోని బాధితురాలకి ఉన్న ముగ్గురు ముఖ్యమైన స్నేహితుల్లో ఒకడైన ముక్తిరంజన్ రాయ్.. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్నాడు. బెంగళూరులోని నెలమంగల సమీపంలో యువతిని ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్‌లో కుక్కి.. 'సడోమా సూకిస్ట్క్' అనే నేరస్వభావంతో నిందితుడు రగిలిపోయినట్లు వైద్య నిపుణులు గుర్తించారు.
 
బుధవారం పాండి గ్రామానికి చేరుకున్న ముఖిరాజన్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ తర్వాత బైకుపై బయటకు వెళ్లాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, మహాలక్ష్మి చివరిసారి ఈ నెల 1వ తేదీన డ్యూటీ చేసింది. 2 లేదంటే 3న నిందితుడు ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహాలక్ష్మి పనిచేస్తున్నచోట ముక్తిరంజన్ రాయ్ విభాగ అధిపతిగా పనిచేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు