గాఢ నిద్రలో భర్త... ప్రియుడితో రసపట్టులో భార్య.. ఆ శబ్దాలకు లేచి చూడగా...

మంగళవారం, 25 జనవరి 2022 (12:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామంలో ఓ మహిళ తన ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ భర్తకు కళ్లారా పట్టుబడింది. భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ప్రియుడిని ఇంటికి పిలిచి శారీరకంగా కలిశారు. అయితే, మంచి రసపట్టులో ఉన్నసమయంలో వారిద్దరూ చేసిన శబ్దాలకు భర్త నిద్రలేచి చూసి నిర్ఘాంతపోయాడు. దీంతో అప్రమత్తమైన భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. చివరకు కరోనా సమయంలో కల్లు లభించకపోవడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు ఇరుగుపొరుగువారిని నమ్మించారు. కానీ, పోలీసుల విచారణలో దొరికిపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన లక్ష్మీ, మహంకాళి కృష్ణ అనే దంపతులు ఉన్నారు. అయితే, ఇదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ అనే వ్యక్తితో కలిసి కృష్ణ 2014లో ఆటోను కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దీంతో బాలరాజ్ తరచుగా కృష్ణ ఇంటికి వస్తూపోతూ లక్ష్మికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ కృష్ణకు తెలియకుండా అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఓ రోజు రాత్రి కృష్ణ తన ఇంట్లో నిద్రపోతుండగా, బాలరాజ్‌ను ఇంటికి పిలిచిన లక్ష్మీ శారీరకంగా కలిశారు. అపుడు వారిద్దరూ చేసిన శబ్దాలకు కృష్ణ నిద్రలేచి చూసి ఆగ్రహించాడు. అంతే.. తన ప్రియుడితో కలిసి లక్ష్మీ కట్టుకున్న భర్తను హత్య చేశారు. దీన్ని ఆత్మహత్యగా నమ్మించేందుకు ప్రయత్నిచారు. కానీ, పోలీసుల విచారణలో అసలు విషయం బట్టబయలు కావడంతో ఇపుడు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు