అత్తను చంపేసిన అల్లుడు.... మంచిర్యాలలో దారుణం (Video)

వరుణ్

సోమవారం, 15 జులై 2024 (08:48 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. పిల్లనిచ్చిన అత్త పట్ల అల్లుడు కిరాతకంగా ప్రవర్తించాడు. తమ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందన్న కోపంతో అత్తపై కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ దారుణం మంచిర్యాల, సున్నంబట్టివాడలో జరిగింది.  ఈ ప్రాంతానికి చెందిన నెల్లి విజయ అనే మహిళ కుమార్తె మాళవికను.. మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈ దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అత్త (విజయకు), అల్లుడు (వెంకటేశ్‌కు)కు మధ్య గొడవలు మొదలయ్యాయి. తమ సంసారంలో చిచ్చుపెట్టిందన్న ఆగ్రహించిన విజయ్.. అత్తపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఆదివారం రాత్రి పీకల వరకు మద్యం సేవించి వచ్చిన వెంకటేశ్ ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్ కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే, తను ప్రాణాపాయం నుంచి బయటపడగా, విజయ మాత్రం చనిపోయింది. స్థానిక పోలీసులు సమాచారం అందుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విజయ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, వెంకటేశ్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 



Sensitive content

అత్తపై కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన అల్లుడు

మంచిర్యాల - చున్నం బట్టివాడకు చెందిన నెల్లి విజయ కూతురు మాళవికను.. మంచిర్యాల పట్టణానికి చెందిన సాత్రం వెంకటేశ్‌కు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు.

దీంతో కూతురు విడాకుల విషయంలో అత్త (విజయకు), అల్లుడు… pic.twitter.com/o7fzb2m41f

— Telugu Scribe (@TeluguScribe) July 14, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు