నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క... ఏంటది?

వరుణ్

సోమవారం, 15 జులై 2024 (08:32 IST)
తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓ శుభవార్త చెప్పారు. త్వరలోనే 11 వేల పోస్టుల భర్తీ కోసం మరో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ చివరిది కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మరో 5 వేలు లేదా 6 వేల పోస్టుల నుంచి భర్తీచేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని గుర్తు చేసిన ఆయన త్వరలోనే మరో డీఎస్సీ జారీచేస్తామని తెలిపారు. 
 
తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని, అందువల్ల నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని కోరారు. తాము అధఇకారంలోకి వచ్చాక రాష్ట్రంలో 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటి భర్తీ కోసమే డీఎస్సీ ప్రకటించామని తెలిపారు. అందువల్ల ఇదే చివరి డీఎస్సీ కాదని మరిన్ని డీఎస్సీలు ప్రకటిస్తామని తెలిపారు. త్వరితగతిన ఉద్యోగాలు ఇవ్వడమే తమ లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. 
 
విదేశాల్లో ఉండగా నా భార్య గర్భవతి అయింది.. బిడ్డకు తండ్రి ఎవరో తేల్చిండి.. 
 
తాను విదేశాల్లో ఉండగా తన భార్య, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి గర్భవతి అయిందని, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ ఆమె భర్త మదన్ మోహన్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పైగా, తన భార్య గర్భానికి వైకాపా మాజీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వై.విజయసాయి రెడ్డి కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రసవత్తర చర్చ సాగుంతుంది. పైగా, ఈ అంశం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో, శాంతి మీడియా ముందుకు వచ్చారు. 2013లో తనకు మదన్ మోహన్‌తో వివాహం జరిగిందన్నారు. న్యాయ విద్యను చదువుతుండగానే తమ ఇద్దరికీ పెళ్లయిందని తెలిపారు. కానీ పెళ్లయ్యాక మదన్ మోహన్ తనను చాలా హింసించాడని శాంతి ఆరోపించారు. దాంతో 2016లో ఇద్దరం విడాకులు తీసుకుని వేర్వేరుగా ఉంటున్నామని చెప్పారు. పిల్లలు, బంగారం, కారు విషయంలో పరస్పర ఆమోదయోగ్యమైన ఒప్పందం కూడా రాసుకున్నామన్నారు. మదన్ మోహన్‌తో విడాకుల తర్వాత తాను సుభాష్ అనే వ్యక్తిని పెళ్లదానని శాంతి వెల్లడించారు.
 
2021 వరకు తాను విశాఖలోనే ఉండేదాన్నని పేర్కొన్నారు. తాను మరొకరిని పెళ్లి చేసుకున్నప్పటికీ, మదన్ తనను వేధిస్తుండేవాడని ఆరోపించారు. అమెరికా నుంచి వచ్చాక పిల్లలను మదన్‌కు చూపించానని తెలిపారు. డబ్బు కోసమే అతడు ఇలాంటి అనుమానాలు సృష్టించేలా ఆరోపణలు చేస్తున్నాడని వివరించారు. "నేను ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. అదే వేరే కులానికి చెందిన దాన్నయితే ఇలా అనగలరా? ఒక ట్రైబల్ అమ్మాయి ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను నగలు ధరించకూడదా? నేను కష్టపడి న్యాయవాద విద్యను చదివాను, అడ్వొకేట్‌గా ప్రాక్టీసు చేశాను. ఒకరి సొమ్ముకు ఆశపడాల్సిన అవసరం నాకు లేదు.
 
ఇక సాయిరెడ్డి గురించి చెప్పాల్సి వస్తే... ఆయనొక గౌరవనీయ వ్యక్తి. నేను విజయసాయిరెడ్డిని తొలిసారి విశాఖలోనే చూశాను. మాది నంద్యాల. రాయలసీమలో నాకు ఒక్క సర్పంచి కూడా తెలియదు. సీమలో ఆడపిల్లలు బయట ఊర్లు తిరిగేది ఉండదు. అలాంటిది ఒక ఎంపీ పరిచయం అయ్యే సరికి, అబ్బ... ఇలా ఉంటుంది అనిపించింది. దేవాదాయ శాఖలో ప్రేమ సమాజం అనే సంస్థ ఉంది. దీని వ్యవహారాలు చూసుకోవాల్సింది అసిస్టెంట్ కమిషనర్. 
 
ఆ ప్రేమ సమాజం సంస్థకు విశాఖ బీచ్ రోడ్‌లో 30 ఎకరాల భూమి ఉంది. అందులో సాయి ప్రియా రిసార్ట్స్ అని ఉంది. ఆ రిసార్ట్స్ వాళ్లు ఆ 30 ఎకరాల భూమికి చాలా తక్కువ మొత్తమే చెల్లిస్తున్నారు. సాయిరెడ్డి ద్వారా ఆ విషయం నా దృష్టికి వచ్చింది. దాంతో నేను ఆ స్థలంలో తనిఖీలకు వెళ్లాను. అక్కడి నిర్వాహకులతో మాట్లాడాను. లీజును పెంచడం ద్వారా ప్రేమ సమాజం సంస్థకు మేలు చేసే ప్రయత్నం చేశాను. ఇదీ... విజయసాయి రెడ్డితో నాకున్న పరిచయం" అంటూ శాంతి కన్నీటిపర్యంతమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు