లిఫ్ట్ అడిగిన పాపానికి కుదులుతున్న కారులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

ఆదివారం, 9 అక్టోబరు 2022 (20:00 IST)
కదులుతున్న కారులోనే బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సుల్తాన్ పూర్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ విద్యార్థిని శుక్రవారం సాయంత్రం తన ఇంటికి వెళ్లేందుకు ఎస్‌యూవీ వాహనాన్ని ఆపి లిఫ్ట్‌ అడిగింది. దీంతో కారులోపలికి ఎక్కిన తనపై కారు డ్రైవరే అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆమె ఆరోపిస్తోంది. 
 
అఘాయిత్యం అనంతరం ఆమెను జైసింగ్‌పూర్‌ కాల్వ సమీపంలో కిందకు పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న తర్వాత బాలిక తనపై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివరించగా.. వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 
 
ఈ ఘటనపై జైసింగ్‌పూర్‌ సర్కిల్‌ అధికారి ప్రశాంత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన తర్వాత దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్టు తెలిపారు. కాగా, శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు