టాలీవుడ్ హాస్య నటుడు బాబూ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన కంట కన్నీరు పెట్టుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబులపై ఉన్న అభిమానంతోనే టీడీపీలో చేరినట్టు చెప్పుకొచ్చారు.
అయితే, ఎవరో ఏదో చెప్పడంతో అనుమానించి తనపై విచారణ వేయడం మనస్సు ఎంతో బాధించిందన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు. కష్టకాలంలో పార్టీకి సేవ చేసినట్టు చెప్పారు. పార్టీ కోసం ఆస్తులను కూడా అమ్ముకున్నట్టు తెలిపారు.
తాను ఏ పార్టీలో చేరాలన్న విషయంపై కార్యకర్తలతో మాట్లాడి ఒక నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. కాగా, బాబూ మోహన్ టీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.