నన్ను నమ్మండి.. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తా : చిరంజీవి

మంగళవారం, 6 మే 2014 (09:30 IST)
File
FILE
నన్ను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని కేంద్ర మంత్రి చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన సోమవారం ఆత్మకూరులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు అందించినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అందించలేదన్నారు. విభజన నేపథ్యంలో సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా హామీ ఇచ్చారన్నారు.

అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా ఓటర్లంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డిని శాసనసభ్యునిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు.

వెబ్దునియా పై చదవండి