హైదరాబాద్‌లోని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీని సందర్శించిన గన్సిడ్ బృందం

ఐవీఆర్

సోమవారం, 5 ఆగస్టు 2024 (17:07 IST)
హైదరాబాద్‌లోని తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ(TSCS)ని ది గ్లోబల్ యాక్షన్ నెట్‌వర్క్ ఫర్ సికిల్ సెల్, అదర్ ఇన్హెరిటెడ్ బ్లడ్ డిజార్డర్స్(గన్సిడ్) బృందం సందర్శించింది. ఈ మూడు-రోజుల కార్యక్రమంలో వారసత్వంగా వచ్చే రక్త రుగ్మతల కోసం సంరక్షణ, చికిత్స మరియు అవగాహనను మెరుగుపరచడానికి ప్రపంచ శక్తులను ఏకం చేయడంలో గన్సిడ్ యొక్క నిబద్ధతను నొక్కి చెప్పింది.
 
ఆగస్ట్ 3, 2024న, గన్సిడ్ ప్రతినిధి బృందంలో నేషనల్ హెల్త్ అథారిటీ, MoHFW, న్యూ ఢిల్లీలో సీనియర్ నిపుణురాలు, డైరెక్టర్, సౌత్ ఈస్ట్ ఏషియన్ జోన్, గన్సిడ్, యుఎస్ఏ డా. వినీతా శ్రీవాస్తవ; గన్సిడ్, లీడ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజియన్, డాక్టర్. జెఎస్ అరోరా; తలసెమిక్స్ ఇండియా, న్యూఢిల్లీ,  సెక్రటరీ, శ్రీమతి శోభా తులి; న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో హెమటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తూలికా సేథ్‌కు హైదరాబాద్ విమానాశ్రయంలో టిఎస్ సిఎస్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రకాంత్ అగర్వాల్, బోర్డు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ట్రాన్స్‌ఫ్యూజన్ సెంటర్, బ్లడ్ సెంటర్, డయాగ్నస్టిక్ ల్యాబ్, అన్నీ ఒకే చోట ఉంచి టీఎస్‌సీఎస్ అందిస్తున్న సమగ్ర సేవలు ప్రతినిధి బృందంను ఆకట్టుకున్నాయి. రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి టిఎస్ సిఎస్ బృందం యొక్క నిబద్ధత, నిస్వార్థ ప్రయత్నాలను ప్రశంసించారు.  
 
ఆగస్ట్ 4న, గన్సిడ్ బృందంతో పాటు శ్రీమతి లాన్రే తుంజి-అజయ్, అమెరికా ఉత్తర ప్రాంతం డైరెక్టర్, గన్సిడ్- సికిల్ సెల్ అవేర్‌నెస్ గ్రూప్ ఆఫ్ ఒంటారియో, యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్/సీఈఓ, బృందంలో వర్చ్యువల్‌గా చేరారు. “హైదరాబాద్‌లోని టిఎస్‌సిఎస్‌కి ఈ సందర్శన ఓ చక్కటి  అనుభవం అందించింది. మేము ఇక్కడ సాధించిన సహకారం, విజ్ఞాన మార్పిడి, ప్రపంచవ్యాప్తంగా వారసత్వంగా వచ్చిన రక్త రుగ్మతల ద్వారా ప్రభావితమైన వారి జీవితాలను మెరుగుపరచడం అనే మా మిషన్‌కు తోడ్పడనుంది. మేము కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని ఎదురు చూస్తున్నాము” అని గన్సిడ్  డైరెక్టర్ శ్రీమతి లాన్రే తుంజి-అజయ్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు