శరీరానికి మేలు చేసే ప్రయోజనాలు ఎన్నో అల్లంలో ఉన్నాయి. అందువల్ల ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకొని తాగినా ఫలితం ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేవగానే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. నిమ్మకాయలో కొవ్వును కరిగించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వీలుంటే తేనె కలుపుకుని తాగితే మరీ మంచిది.
పుదీనా ఆకుల రసం ఉదయాన్నే తాగినా కొవ్వు తగ్గుతుంది. ఇలా చేయటం వల్ల మెటబాలిజం పెరిగి క్యాలరీలను తగ్గించటంలో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి అర్థగంట ముందు అలోవెరా జ్యూస్ను 30 ఎంఎల్ మోతాదులో తీసుకొని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగేయాలి. మలబద్దకం పోవటంతోపాటు బరువు తగ్గిపోతారు.
కీరదోసకాయ జ్యూస్ ఒక గ్లాస్ భోజనానికి అర్థ గంట ముందు ఉదయం, సాయంత్రం తీసుకొంటే ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. కొవ్వు కరుగుతుంది. రోజూ ఉదయాన్నే పరగడుపున 1 లేదా 2 టమాటాలను తినాలి. దీంతో పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.