తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీ తాగితే?

శుక్రవారం, 10 మార్చి 2023 (23:38 IST)
లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాము. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది.
 
తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా, కడుపులో వికారంగా వుంటే లవంగాల నూనెను తీసుకుంటే సమస్య తగ్గుతుంది. తేనె, లవంగాల నూనెను గోరువెచ్చని నీటిలో కలిపి రోజుకు మూడుసార్లు తాగితే జలుబు తగ్గుతుంది. కాలేయ సమస్యలకు లవంగం మంచి మందులా పని చేసి మేలు చేస్తుంది. 
 
తులసి, పుదీనా, లవంగాలు, యాలకుల మిశ్రమంతో టీలా చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది.ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం వల్ల ఒత్తిడి, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు