కావలసిన పదార్థాలు : అవిసాకు... పావుకేజీ కందిపప్పు... పావుకేజి పచ్చిమిర్చి... 10 కాయలు పచ్చికొబ్బరి కోరు... అరచిప్ప ఉప్పు... సరిపడ మినప పప్పు... 2 టీస్పూన్లు శనగపప్పు... 2 టీస్పూన్లు ఆవాలు... అర టీస్పూన్ నూనె... వేపుడుకు సరిపడ చింతపండు... కొద్దిగా (చిక్కగా పులుసుతీసి ఉంచాలి) కరివేపాకు... తగినంత కొత్తిమీర - తగినంత
తయారీ విధానం : నీటిలో ఉడికించి వార్చిన అవిసాకును చేతితో మెత్తగా పిసికి శుభ్రంగా కడిగి నీరు పోయే విధంగా పిండుకోవాలి. తరువాత అవిసాకు ముద్దను ఉడికించి వార్చిన కందిపప్పులో వేయాలి. ఆపై చింతపండు పులుసు, కోరిన కొబ్బరి, రెండు చిటికెల పసుపు, పచ్చిమిరప కాయలు, ఉప్పు దంచి పప్పుకు కలపాలి.
పొయ్యిమీద గిన్నెనుగాని, బాణలినిగానీ పెట్టి నూనె వేసి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు బాగా వేయించి ఆ పోపులో పై పప్పు మిశ్రమాన్ని వేసి కలియబెట్టాలి. అయిదు నిమిషాలు సన్నని మంటమీద ఉడికించిన తర్వాత క్రిందకు దించాలి. అంతే వేడి వేడి అవిసాకు తాళింపు రెడీ.