తయారీ విధానం : అర కప్పు పాలలో ఎండు ఖర్జూరాలు (డేట్స్)ను వేసి రెండు గంటలసేపు నానబెట్టాలి. తరువాత ఖర్జూరాలను బయటికి తీసి వాటిలోంచి గింజలను తీసివేయాలి. అందులోనే బాదం, పిస్తా, జీడి పప్పులను, వాల్నట్స్ను వేసి మరికొన్ని పాలు పోసి బాగా నానబెట్టాలి.
తరువాత వాటన్నింటినీ తీసి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మిగిలిన పాలను చిక్కగా అయ్యేంతదాకా కాచి, పంచదార వేసి కలపాలి. సన్నటి సెగపైన పంచదార మొత్తం కరిగేదాకా కలుపుతూ ఉండాలి. పాలు సగం అయ్యాక అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి.
దీన్ని అడుగంటకుండా తిప్పుతూ కాసేపటి తరువాత దించేయాలి. చల్లారిన తరువాత ఫ్రిజ్లో పెట్టి, చల్లగా అయిన తరువాత తీసి కప్పుల్లో పోసి సర్వ్ చేయాలి. అంతే ఖర్జూరాలతో బాదం, పిస్తా స్పెషల్ రెడీ అయినట్లే..!