కావలసిన పదార్థాలు : రైస్-2 కప్పులు ఉల్లిపాయ-1 పచ్చిబఠాణీ-1/2 కప్పు కారం-1 చెంచా ఉప్పు- సరిపడ జీలకర్ర-1/2 చెంచా టమోటాలు-2 అల్లం పేస్టు-1 చెంచా కొత్తిమీర- కొంచెం నూనె- 4 చెంచాలు
తయారీ విధానం :
ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వాలి. ఈ లోగా టమోటాలు, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చెయ్యాలి. బియ్యం వడబోసి ప్రక్కన ఉంచండి. బాండీపెట్టి నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర వేసి వాటికి ఉల్లిముక్కలు వేసి వేపాలి.
వేగుతున్న వీటికి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా జతచేసి ఎర్రగా వేపుకోవాలి. వేగిన తర్వాత వీటికి టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బఠాణీ, కారం, కొత్తిమీర, సరిపడ ఉప్పు, పసుపు వేసి రెండు నిమిషాలు బాగా వేపాలి. తర్వాత మూడు నిమిషాలు మగ్గనిచ్చి వాటిలో బియ్యం 3 కప్పులు నీరుపోసి సన్నని మంట మీద ఉడికించాలి. ఉడికిన తర్వాత మూతపెట్టి 10 నిమిషాలు తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయ్యాలి.