ముందుగా బాణలి పెట్టి నూనె వేసి బాగా కాగనివ్వాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేపాలి. వీటికి కొబ్బరి తురుము కలిపి బాగా మగ్గించి వేపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లార్చిన మిశ్రమానికి కొత్తిమీర, పుదీన, పంచదార, ఉప్పు సరిపడ, పసుపు జత చేసుకుని మిక్సీలో వేసి మెత్తగా పేస్టులాగా చేసుకోవాలి. చట్నీని బౌల్ లోకి తీసి నిమ్మరసం కలిపి ఉప్పు సరిచూసుకుని వేడి వేడి సమోసా, కబాబ్స్ లాంటి వాటిలోకి ఈ చట్నీని సర్వ్ చేయండి ఆంతే ధనియా చట్నీ రెడీ.