కావలసిన పదార్థాలు : బాస్మతి బియ్యం... అర కేజీ కాబూలీ శెనగలు... వంద గ్రా. నెయ్యి... 50 గ్రా. ఉల్లిపాయలు... మూడు అల్లంవెల్లుల్లి ముద్ద... రెండు టీ. నల్ల ఉప్పు... రెండు టీ. ధనియాలపొడి... ఒక టీ. టొమోటోలు... వంద గ్రా. కారం... ఒక టీ. మిరియాలపొడి... పావు టీ. చనామసాలా... రెండు టీ. కొత్తిమీర... రెండు కట్టలు పెరుగు... ఒక కప్పు ఉప్పు... సరిపడా
తయారీ విధానం : ఒక రాత్రంతా నానబెట్టిన శెనగలను కుక్కర్లో వేసి చిన్నమూటలో కట్టిన టీపొడితో పాటు ఉడికించాలి. నాలుగు విజిల్స్ వచ్చిన తరువాత దించేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా వేయించాలి. తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి, కారం, పైన చెప్పుకున్న ఇతర మసాలా దినుసులనూ వేసి వేయించాలి. ఆపై టొమోటో ముక్కల్ని వేసి బాగా ఉడికించాలి. అనంతరం ఉడికించిన శెనగలు, ఉప్పు, పెరుగు వేసి కలియబెట్టాలి.
పలావు బియ్యాన్ని మూడువంతులదాకా ఉడికించి వార్చాలి. ఇప్పుడు వేరే గన్నెలో కొద్దిగా అన్నం దానిమీద పైన తయారు చేసిన కూర మళ్లీ దానిపైన అన్న, మళ్లీ కూర... అలా చేసిన తరువాత ఆ పాత్రను స్టవ్పై పెట్టి సన్నటి మంటపై మగ్గనివ్వాలి. అన్నం పూర్తిగా ఉడికిన తరువాత ఓసారి మొత్తం కలియదిప్పి, కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే పంజాబీ చోళె బిర్యానీ సిద్ధమైనట్లే...!