కావలసిన పదార్థాలు : పనీర్... పావు కేజీ మీగడ... పావు లీ. పెరుగు... పావు లీ. వెన్న... 25 గ్రా. సెనగపిండి... ఒక టీ. అల్లంముద్ద... అర టీ. మిఠాయి రంగు... కాస్తంత దాల్చిన చెక్క... మూడు లవంగాలు... మూడు యాలకులు... మూడు పలావు ఆకు.. ఒకటి బాదం పేస్ట్... ఒక టీ. కొత్తిమీర... అర కట్ట కుంకుమపువ్వు... కొద్దిగా ఉప్పు... తగినంత
తయారీ విధానం : పెరుగు, అల్లం, ఉప్పు, మిఠాయిరంగు అన్నీ కలిపి పనీర్ముక్కలకి పట్టించి ఓ గంటసేపు నాననివ్వాలి. సెనగపిండిలో కాసిన్ని నీళ్లు పోసి మెత్తగా పేస్టులా చేయాలి. స్టవ్మీద బాణలి పెట్టి వెన్న వేసి వేడయ్యాక.. దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, పలావు ఆకు వేసి ఓ నిమిషం వేయించాలి. అందులో మీగడ, కుంకుమపువ్వు వేసి సిమ్లో ఐదు నిమిషాలు ఉంచాలి.
తరువాత అందులోనే పనీర్ ముక్కలు వేసి ఉడికించాలి. బాదం, సెనగపిండి మిశ్రమాల్ని కూడా వేసి మూతపెట్టి సిమ్లో మరో ఐదునిమిషాలు ఉడికించి దించాలి. చివరగా కొత్తిమీర తురుము చల్లి వేడివేడిగా రొట్టె లేదా చపాతీల్లోకి వడ్డిస్తే భలే రుచిగా ఉంటుంది.