బాస్మతి బూందీ కా పలావ్‌

కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం... నాలుగు కప్పులు
దాల్చిన చెక్క... రెండంగుళాలు
యాలకులు... ఆరు
లవంగాలు... ఆరు
పలావు ఆకులు... రెండు
ఎండుమిర్చి... నాలుగు
నెయ్యి... ఆరు టీ.
బూందీ... రెండు కప్పులు

తయారీ విధానం :
బాస్మతి బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి. తరువాత నీటిని వంపేసి కాసేపు పక్కనుంచాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి ఎండుమిర్చి, మసాలా దినుసులన్నింటినీ వేసి చిటపటమన్నాక బియ్యం కూడా వేసి రెండుమూడు నిమిషాలు వేయించాలి.

తరవాత సరిపడా నీళ్లు పోసి, ఉప్పు వేసి మూత పెట్టి తక్కువ మంటమీదే బియ్యం ఉడికించాలి. చివరగా ఉడికిన అన్నాన్ని ప్లేటులో ఆరబెట్టి బూందీ కలిపి అందిస్తే బాస్మతి బూందీ కా పలావ్‌ తయారైనట్లే...!!

వెబ్దునియా పై చదవండి