కావలసిన పదార్థాలు : సేమ్యా... వంద గ్రా. వేయించిన వేరుశెనగపప్పు... రెండు టీ. ఉప్పు... సరిపడా నిమ్మకాయ... ఒకటి నూనె... వంద గ్రా. పోపుగింజలు... కాసిన్ని కొబ్బరిచిప్ప... ఒకటి కొత్తిమీర... రెండు టీ. జీడిపప్పు... కొద్దిగా
తయారీ విధానం : కొబ్బరిని తురిమి పక్కన పెట్టుకోవాలి. సేమ్యాలో ఉప్పు వేసి ఉడికించాలి. దాంట్లోనే కొద్దిగా నూనె కలిపి ఓ గిన్నలోకి తీసుకుని దానిమీద మళ్లీ చల్లటి నీళ్ళుపోసి వార్చాలి. ఇలా చేసినట్లయితే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
ఇప్పుడు బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక... పోపుగింజలు, కొబ్బరి తురుమును వేసి 5 నిమిషాలు వేయించి, తర్వాత సేమ్యాని వేసి మరో ఐదు నిమిషాలు వేయించి.. చివర్లో నిమ్మరసం, కొత్తిమీర, వేయించిన జీడిపప్పు, వేరుశెనగపప్పులను పైన చల్లి సర్వ్ చేయాలి.