కావలసిన పదార్థాలు : మైదా... అరకేజీ నూనె... రెండు టీ. ఉప్పు... తగినంత
కూర కోసం... ఉల్లి, క్యారెట్, క్యాబేజీ తురుము... తలా రెండు కప్పులు అల్లం వెల్లుల్లి తురుము... రెండు టీ. కారం... అర టీ. పుదీనా... రెండు కట్టలు ధనియాలపొడి... అర టీ. నిమ్మ ఉప్పు... చిటికెడు ఉప్పు... తగినంత నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం : మైదాపిండిలో ఉప్పు, నూనె వేసి తగినన్ని నీళ్లతో చపాతీపిండిలా ముద్దగా కలిపి మెత్తగా ఉండేలా చేయాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెద్ద సైజు పూరీల్లా ఒత్తాలి. రొట్టెలపెనంమీద వీటిని కాల్చితే రుమాలీ రోటీల్లా వస్తాయి. ఇప్పుడు ఈ రోటీని నిలువుగా మూడు ముక్కలుగా అంటే రిబ్బన్లలా కోయాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్నీ ఇతర దినుసుల్నీ కలపాలి. రోటీ రిబ్బన్ ముక్కల్ని ఓ వైపు నుంచి కోన్లా చుట్టి ఆ కోన్లో కూరముక్కల మిశ్రమాన్ని పెట్టాలి. తరవాత దీన్ని త్రికోణాకారం వచ్చేలా మడిచి, అంచుల్ని మైదాపిండితో అంటించాలి. ఇలా చేసిన సమోసాల్ని కాగుతున్న నూనెలో ఎర్రగా వేయించి తీయాలి.