లాడెన్ మా దేశంలో లేడు మొర్రో: మంత్రి మాలిక్

మంగళవారం, 1 డిశెంబరు 2009 (19:03 IST)
అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ అధిపతి ఒసామా బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ మరోమారు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎవరైనా సమాచారం అందిస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని ఆ దేశ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ హామీ ఇచ్చారు. దీనిపై ఆయన సోమవారం లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లో ఉన్నట్టు ఎవరివద్దనైనా సమాచారం ఉన్నట్టయితే తమతో పంచుకుంటే తప్పకుండా చర్య తీసుకుంటామని మాలిక్ చెప్పాడు.

ఒసామా బిన్ లాడెన్, ఆతని డిప్యూటీ జవాహరీల ఆచూకీ కనుగొనాలని, ఇందుకోసం కోసం పాకిస్థాన్ మరింత గట్టిగా కృషి చేయాలని బ్రిటీష్ ప్రధాన మంత్రి గార్డెన్ బ్రౌన్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై రెహ్మాన్ మాలిక్ పై విధంగా స్పందించారు.

దీనిపై మాలిక్ స్పందిస్తూ.. పాకిస్థాన్‌లో 9/11 తరహా దాడులను మేం ప్రతిరోజూ చవి చూస్తున్నాం. ఒసామా పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు ఆచూకీ తెలిస్తే తప్పకుండా చర్య తీసుకుంటామని మంత్రి మాలిక్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి