'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... ఇండియన్‌కు ఘోర అవమానం

బుధవారం, 23 ఆగస్టు 2017 (16:32 IST)
జాత్యహంకార ధోరణి అమెరికాలో పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. తాజాగా భారత సంతతికి చెందిన ఓ వ్యాపారస్తుడిపై కొందరు అమెరికన్లు చేస్తున్న దారుణ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇటీవలే అమెరికాలో జరిగిన చార్లెసట్‌విల్లే ఘ‌ట‌నపై ట్రంప్ వైఖ‌రిని వ్య‌తిరేకిస్తున్నట్లు భార‌త సంత‌తి వ్యాపార‌స్తుడు, జీఎంఎం నాన్‌స్టిక్ కోటింగ్స్ సంస్థ‌కు సీఈఓగా ఉన్న ర‌వీన్ గాంధీ సీఎన్‌బీసీలో ఓ వ్యాసం రాశారు. 
 
తమ రంగులో లేని అమెరికన్లపై జరుగుతున్న దౌర్జన్యాలపై ఆయన విమర్శిస్తూ అందులో పేర్కొన్నారు. అంతే... ఆ పోస్టును చూసిన అమెరికన్లు రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. ఓ మహిళ అయితే ఫోన్లో... 'పందీ... పరదేశీ..' అమెరికా వదిలి వెళ్లిపో.... అంటూ దారుణంగా చెప్పలేని భాషలో తిట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారాన్నంతా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆయన షేర్ చేసారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు