పాకిస్థాన్ తీవ్రవాది, పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధాని మసూద్ అజార్కు మళ్ళీ చైనా వత్తాసు పలికింది. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది. తద్వారా భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించాలని చైనా నిర్ణయించింది.
మసూద్ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుండా భారత తీర్మానం తానంతట అదే ఆమోదం పొందేది. కానీ చైనా ఆరునెల పాటు ఈ వీటోను పొడిగించడం ద్వారా.. పాక్ ఉగ్రవాదికి చైనా వంత పాడినట్లైంది.