బ్రెజిల్‌ను ముంచెత్తిన వరదలు.. మృతుల సంఖ్య 116కి చేరిక

సెల్వి

శనివారం, 11 మే 2024 (09:17 IST)
Brazil
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో సంభవించిన తుఫానుల కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుందని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 143 మంది గల్లంతు కాగా, 756 మంది గాయపడ్డారు. దాదాపు 400,000 మంది నిరాశ్రయులైనారని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. 
 
తుఫానుల వల్ల మొత్తం 1,947,372 మంది ప్రభావితమయ్యారు, అయితే 70,863 మందిని భద్రతా దళాలు, రక్షకులు రక్షించారని ఏజెన్సీ తెలిపింది. గుయబా నది నగరాన్ని ముంచెత్తడంతో రాష్ట్ర రాజధాని పోర్టో అలెగ్రేలోని సల్గాడో ఫిల్హో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్,సేవలను నిలిపివేసింది.  ఏప్రిల్ 29 నుండి, వర్షాలు, వరదలు, 437 కంటే ఎక్కువ మునిసిపాలిటీలు తుఫానులతో మునిగాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు