మాస్కో ఉగ్రదాడిని ఖండించిన భారత ప్రధాని మోదీ

సెల్వి

శనివారం, 23 మార్చి 2024 (15:33 IST)
మాస్కో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది హేయమైన చర్య అని అన్నారు. మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా ప్రార్థనలు బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలి. ఈ విషాద ఘటనలో రష్యన్ ప్రజలకు భారత్ మద్దుతుగా నిలుస్తుందని ట్వీట్‌లో స్పందించారు. 
 
ఈ ఘటనలో 60 మందిని ప్రాణాలు కోల్పోయారు. దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. గత రెండేళ్లుగా రష్యాపై ఐసిస్-కే దృష్టి సారించిందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన ప్రచారంలో తరచూ విమర్శిస్తున్నారు. 
 
ఇదే విషయాన్ని న్యూయార్క్‌కు చెందిన సెక్యూరిటీ కన్సల్టింగ్ సంస్థ సౌఫాన్ గ్రూప్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విశ్లేషకుడు కొలిన్ పి క్లార్క్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు