టాప్ గన్-ఎంపీజెంకీ- వీడీజెంకీ- టాకింగ్ ఫ్రాగ్ లాంటి మొబైల్ గేమ్లను మార్గాలుగా ఐఎస్ఐ ఎంచుకుంటోంది. అంతేగాకుండా భారత మాజీ సైనికులే లక్ష్యంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాజీ సైనికులను లక్ష్యంగా చేసుకుని వారికి ఉద్యోగాలు-డబ్బులు ఆశ చూపిస్తూ మొబైల్స్ ద్వారా ఈ వైరస్ను భారత్లో వ్యాప్తిచేసేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తోంది. ఈ వైరస్ సాయంతో భారత్లో కీలక సమాచారం రాబట్టాలనేది ఐఎస్ఐ లక్ష్యమని తెలుస్తోంది.
ఐఎస్ ఐ వలలో పడి ఇలా సాఫ్ట్ వేర్ ద్వారా వైరస్ లను వ్యాప్తి చేస్తున్న మాజీ సైనిక అధికారులను భద్రతా వర్గాలు పట్టుకుంటున్నాయి. 2013 నుంచి 2016 మధ్య ఏడుగురు ఎక్స్ సర్వీస్ మెన్ లను ఏడుగురిని అధికారులు అరెస్టు చేశారు. ఇలా మొబైల్ అప్లిక్లేషన్స్ పై ఒక కన్ను వేశామని పూర్తి స్థాయిలో దీన్ని నిరోధించానికి ప్రయత్నాలు చేస్తున్నామని భద్రతాధికారులు చెబుతున్నారు.