అమెరికాలో సింహాలను కూడా వదలి పెట్టని కరోనా..

గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:01 IST)
Lion
అమెరికాలోని పులులకు తర్వాత సింహాలకు కూడా కరోనా సోకినట్లు తెలియవచ్చింది. ఈ వార్త అగ్రరాజ్యం అమెరికాను వణుకుపుట్టేలా చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 
 
ప్రస్తుతం మృగాలకు కూడా కరోనా వైరస్ ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటికి మొన్న పులులకు, ప్రస్తుతం పిల్లులకు కూడా కరోనా సోకినట్లు వార్తలు రాగా.. తాజాగా సింహాలను కూడా కరోనా వదిలిపెట్టలేదని సమాచారం.
 
మొట్టమొదటి సారిగా న్యూయార్క్ నగరంలోని పార్కులో పులులకు కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అదే పార్కులోని సింహాలను కూడా కరోనా సోకినట్లు ధ్రువీకరించారు. దీంతో మొత్తం నాలుగు పులులు, మూడు సింహాలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు