తప్పును సరిదిద్దుకున్నారు.. తాత వర్ధంతికి కిమ్.. 15 కుందేళ్ళను పెంచాలని..?

శుక్రవారం, 10 జులై 2020 (19:44 IST)
ఉత్తర కొరియా నిర్మాత, ఆ దేశాన్ని పాలించిన మొదటి వ్యక్తి కిమ్ తాత కిమ్ 2 సంగ్. కొరియా రెండు భాగాలుగా విభజించబడిన తర్వాత ఆ దేశానికి నాయకత్వం వహించిన మొదటి వ్యక్తి ఇతను. ఆ దేశ ప్రజలు కిమ్ 2 సంగ్‌ను దేవుడి రూపంగా భావిస్తారు. అతను ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతారు. అతని తర్వాత కిమ్ తండ్రి, ఇప్పుడు కిమ్ ఆ దేశాన్ని పాలిస్తున్నాడు. 
 
అయితే ఆ దేశ నిర్మాతగా భావించే తన తాత జయంతికి కిమ్ హాజరు కాలేదు. దీంతో కిమ్ మరణించాడని అందుకే ఎప్పుడూ లేని విధంగా ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వార్తల ప్రభావం ఆ దేశంపై భారీగానే పడింది. దీంతో కిమ్ ఇప్పుడు తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. గురువారం తన తాత గారి 26వ వర్థంతిని కిమ్ ప్రభుత్వం అంగ రంగ వైభవంగా జరిపించింది. ప్రతి ఒక్కరు కూడా నల్లని డ్రెస్ లో ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. 
 
ఈ కార్యక్రమానికి హాజరైన ఏ ఒక్కరు మాస్కు ధరించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేడుకల సందర్భంగా కిమ్ మరో సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. తమ దేశంలోని సైనికులు ప్రతి ఒక్కరు తమ ఇంట్లో దాదాపు 15 కుందేళ్ళను పెంచాలని ఆదేశించాడు.
 
తమ దేశం పోష్టికాహార లోపం బారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే కిమ్ నిర్ణయాన్ని ఏ ఒక్కరు పాటించకపోయినా, ఆకస్మిక తనిఖీల్లో లెక్క తక్కువగా వచ్చినా కఠిన శిక్షలు తప్పవని కూడా వార్నింగ్ ఇచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు