భూతాపం.. హిమనీనదంతో వరద.. కూలిపోయిన బ్రిడ్జి

బుధవారం, 11 మే 2022 (15:49 IST)
Hassanabad bridge
భూతాపంతో హిమ పర్వతాలు కరిగిపోయి ఆ నీళ్లతో వరదలు ముంచెత్తుతున్నాయి. అలాంటి ఘటనే పాకిస్థాన్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
గత శనివారం మౌంట్ షిష్పర్‌లోని షిష్పర్ గ్లేసియర్ (హిమనీనదం) కరిగిపోయి వరద ముంచెత్తింది. ఆ వరద ధాటికి కారాకోరం హైవేపై ఉన్న హసనబాద్ వంతెన కూలిపోయింది. భూతాపం వల్లే హిమనీ నదం కరిగిపోయి నీటి మట్టం పెరిగిందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ పర్యావరణ మార్పుల మంత్రి, సెనేటర్ షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాకిస్థాన్ కు ముప్పు పొంచి ఉందని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించామని ఆమె గుర్తు చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

A few days ago @ClimateChangePK had warned that Pakistan’s vulnerability is high due to high temps. Hassanabad bridge on the KKH collapsed due to GLOF from the melting Shisper glacier which caused erosion under pillars. Am told FWO will have a temporary bridge up in 48 hours. 1/2 pic.twitter.com/Sjl9QIMI0G

— SenatorSherryRehman (@sherryrehman) May 7, 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు