కరాచీలో దారుణం.. విడాకులు కోరిందనీ కుమార్తె కాళ్లు నరికేసిన కసాయి తండ్రి!

సెల్వి

శనివారం, 27 జులై 2024 (10:38 IST)
పాకిస్థాన్ దేశంలోని కరాచీ నగరంలో దారుణం జరిగింది. సంసార బాధ్యతలు విస్మరించి హింసిస్తున్న భర్త నుంచి వేరుపడేందుకు విడాకుల కావాలంటూ ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తండ్రి... తమ కుటుంబ పరువు తీస్తుందంటూ కుమార్తెపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ, గొడ్డలితో ఆమె కాళ్లు నరికేశాడు. కరాచీకి చెందిన బాధిత మహళ తండ్రి సయ్యద్ ముస్తఫా షా.. మామలు సయ్యద్ ఖుర్బాన్ షా, ఎహసాన్ షా, షా నవాజ్, ముస్తాక్ షా కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారు. వీరందరిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తన భర్త నిత్యం వేధించేవాడని, ఇద్దరు పిల్లలను ఏనాడూ పట్టించుకోలేదని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు కూడా ఏమాత్రం పట్టించుకోలేదని బాధితురాలు సోబియా బతూత్ షా వాపోయింది. దీంతో అతడి నుంచి విడిపోవాలనుకుని విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పింది. ఇది తమ కుటుంబ సభ్యులకు ఆగ్రహం తెప్పించిందని, భర్తపై కోర్టుకెక్కడం ద్వారా కుటుంబానికి చెడ్డపేరు తెస్తోందని భావించిన సోబియా కుటుంబ సభ్యులంతా కలిసి దారుణానికి పాల్పడ్డాడు. కష్టాల్లో ఉన్న కుమార్తెకు అండగా నిలబడాల్సిన తండ్రి.. గొడ్డలితో కుమార్తె కాళ్లు నరికి వేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు