సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం - 20 మంది హజ్ యాత్రికల మృతి

మంగళవారం, 28 మార్చి 2023 (08:51 IST)
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. హజ్ యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు యాసిర్‌ ప్రావిన్స్‌ ప్రాంతంలో వంతెనను ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు