భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు సిబ్బందితో సహా ఆక్సియం-4 మిషన్ (Ax4) సిబ్బంది జూలై 14న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తిరుగు ప్రయాణం చేయనున్నారు. ఆక్సియం స్పేస్ షేర్ చేసిన ప్రకటన ప్రకారం, ఆక్సియం స్పేస్ సిబ్బంది సోమవారం ఉదయం 7:05 ET (సుమారుగా సాయంత్రం 4:30 గంటల) కంటే ముందుగా స్పేస్ స్టేషన్ నుండి అన్డాక్ చేయనున్నారు.