అసోసియేట్ జడ్జిగా భారత-అమెరికన్ న్యాయవాది విజయ్ శంకర్‌ను ప్రతిపాదించిన ట్రంప్

సోమవారం, 4 జనవరి 2021 (20:12 IST)
డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ అసోసియేట్ జడ్జి పదవికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత-అమెరికన్ న్యాయవాది విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు.

ఆదివారం సెనేట్‌కు ఇచ్చిన ప్రకటనలో ట్రంప్ మాట్లాడుతూ శంకర్ నామినేషన్ 15 సంవత్సరాల పాటు వుంటారని చెప్పారు. సెనేట్ ఆమోదించినట్లయితే, ఇప్పుడు పదవీ విరమణ చేసిన జాన్ ఆర్ ఫిషర్ స్థానంలో శంకర్ నియమితులవుతారు. డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ వాషింగ్టన్ డిసికి అత్యున్నత న్యాయస్థానం.
 
గత జూన్‌లో ట్రంప్ మొదటసారిగా శేఖర్‌ను నామినేషన్ చేసారు. ప్రస్తుతం ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ డివిజన్లో సీనియర్ లిటిగేషన్ కౌన్సెల్‌గాను, అప్పీలేట్ విభాగం డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
 
2012లో న్యాయ శాఖలో చేరడానికి ముందు, శంకర్ వాషింగ్టన్ డిసిగానూ, మేయర్ బ్రౌన్, ఎల్ఎల్సి, కోవింగ్టన్, బర్లింగ్, ఎల్ఎల్పి కార్యాలయాలతో ప్రైవేట్ ప్రాక్టీసులో ఉన్నారు. లా స్కూల్ నుండి గ్రాడ్యుయేషన్ తరువాత, శంకర్ రెండవ సర్క్యూట్ కోసం యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్లో న్యాయమూర్తి చెస్టర్ జె స్ట్రాబ్కు న్యాయ గుమస్తాగా కూడా పనిచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు