క్యాపిటల్‌ భవనంలో ట్రంప్‌ మద్దతుదారుల కాల్పులు..ఒకరు మృతి

గురువారం, 7 జనవరి 2021 (10:56 IST)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరాజయం పాలైనా తన పీఠాన్ని వదిలేందుకు మంకు పట్టుపడుతున్నారు. ఆ పీఠాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగబడుతున్నారు. ఆయన మద్దతుదారులు కూడా ఆయన్నే అనుసరిస్తున్నారు.

క్యాపిటల్‌ భవనంలో ట్రంప్‌ మద్దతుదారులు కాల్పులు జరపడంతో ఓ మహిళ మృతి చెందారు. ఇటీవల అధ్యక్షుడిగా ఎన్నికైనా జో బైడెన్‌ గెలుపును అధికారికంగా ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్‌ బుధవారం సమావేశమైంది.

ఈ సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ..ఈ ఎన్నిక చెల్లదంటూ క్యాపిటల్‌ భవనంలోకి దూసుకొచ్చి కాల్పులు జరపడంతో ..ఆమె భుజానికి బుల్లెట్‌ దూసుకెళ్లగా..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారని వార్తా సంస్థ వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది.
 
 బైడెన్‌ గెలుపు చెల్లదని, ఈ ఎన్నికలు రద్దు చేయాంటూ ట్రంప్‌ మద్దతు దారులు పెద్ద యెత్తున నినాదాలు చేశారు. బారికేడ్లను దాటి.. కాంగ్రెస్‌లోకి దూసుకువచ్చారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కాల్పులు చోటుచేసుకోగా..ఒక మహిళ మృతి చెందారు.

అయితే ట్రంప్‌ మద్దతు దారులను భద్రతా బలగాలు, పోలీసులు నియంత్రించారు. కాగా, ఈ ఘటనను కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్రంగా ఖండించారు. ఇది తిరుగుబాటు చర్యగా అభివర్ణించిన ఆయన..ఈ హింసాత్మక చర్యలు చల్లారాలంటే ట్రంప్‌ మీడియా సమావేశంలో మాట్లాడాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఇదంతా ట్రంప్‌ కుట్రలో భాగమని రాజకీయ పండితుల విశ్లేషణ. జో బైడెన్‌ను అధ్యక్షునిగా ధ్రువీకరించే ప్రక్రియను అడ్డుకోవాలని సెనేటర్లకు ట్రంప్‌ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు