అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా లేదా మరో దేశం మద్దతు ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ పక్షాన చేరితో అది కేవలం ఇరాన్కు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు.
ఒకవైపు ఇజ్రాయెల్ దాడులకు అమెరికా రహస్యంగా మద్దతు ఇస్తూ, మరోవైపు అణు ఒప్పందం చర్చలకు తమను ఆహ్వానించడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో అణు చర్చలు జరపడానికి ఇరాన్ సిద్దంగా లేదని ఆయన స్పష్టం చేశారు.