వీహెచ్‌పీ - భజరంగ్‌ దళ్‍ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలు : సీఐఏ రిపోర్టు

శుక్రవారం, 15 జూన్ 2018 (12:59 IST)
భారత్‌కు చెందిన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ సంస్థలు మతపరమైన తీవ్రవాద సంస్థలని అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) ఓ నివేదిక సమర్పించింది. వరల్డ్ ఫ్యాక్ట్‌బుక్ అనే పేరుతో సీఐఏ విడుదల చేసిన ఓ పుస్తకంలో ఈ విషయాన్ని పేర్కొంది.
 
దీంతో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ గ్రూపులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లు.. రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకువస్తుంటాయని ఆ నివేదిక పేర్కొంది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్‌లు రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాయని, అవి రాజకీయ నాయకులను ప్రభావితానికి లోనుచేస్తుంటాయని, కానీ ఆ సంస్థలకు పనిచేసే వారు ఎన్నికల్లో మాత్రం పోటీ చేయరు అని సీఐఏ తన నివేదికలో తెలిపింది. 
 
అయితే ఈ నివేదికను విశ్వహిందూ పరిషత్ నేతలు ఖండించారు. తమపై తీవ్రవాద ముద్ర వేసినందుకు సీఐఏ క్షమాపణలు చెప్పాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. అలాగే, సీఐఏ ఇచ్చిన నివేదికపై జోక్యం చేసుకుని మాట్లాడాలని భారత్ ప్రభుత్వాన్ని కోరినట్లు వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు