టొగొగా మార్కెట్‌పై వైమానికి దాడులు... 80 మంది మృత్యువాత

గురువారం, 24 జూన్ 2021 (10:52 IST)
ఇథియోపియా దేశంలోని ఉత్తర డిగ్రే ప్రాంతంలోని టొగొగాలో ఓ మార్కెట్‌పై వైమానికి దాడి జరిగింది. ఈ దాడిలో 80 మంది మృతి మృత్యువాతపడ్డారు. వందలాదిమంది గాయపడ్డారు. వీరిలో పలువురు అభంశుభం తెలియని చిన్నారులు కూడా ఉన్నారు. 
 
గతేడాది నవంబరు నుంచి ఇథియోపియా సైనికులకు, టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ (టీపీఎల్ఎఫ్) తిరుగుబాటు దళాలకు మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వైమానిక దాడి జరిగింది. మార్కెట్‌పై విమానం నుంచి బాంబులు జారవిడవడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. 
 
ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని సైనికులు అనుమతించడం లేదు. ఘటనా స్థలానికి బయలుదేరిన అంబులెన్సులను కూడా వెనక్కి పంపిస్తున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు