ఏప్రిల్ 3న ధోనీ మాతో ఉంటాడు.. కెప్టెన్సీ నుంచి ఎందుకు తొలగించామంటే?: గోయెంకా

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పక్కనబెట్టి.. స్టీవెన్ స్మిత్‌కు కెప్టెన్సీ అప్పగించిన పూణే జట్టు ఓనర్ సంజీవ్ గోయంకా ఏమంటున్నాడో తెలుసా? అయితే చదవండి. పూణే జట్టు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోయెంకా, స్టీవ్ స్మిత్ కనిపించారు. కానీ ధోనీ మిస్సయ్యాడు. ధోనీ ఎక్కడ అంటూ మీడియా ప్రశ్నించింది.
 
దీనిపై గోయెంకా మాట్లాడుతూ.. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి ఐపీఎల్ పదో సీజన్ మొదలుకానుందని గుర్తు చేసిన ఆయన, ఏప్రిల్ 3 నుంచి ధోనీ తమతో ఉంటాడని తెలిపాడు. ధోనీని తాను కలిసిన ప్రతిసారి ఏదొకటి నేర్చుకునే తిరిగొచ్చేవాడినని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ మంచి ఆటగాడిగా, లీడర్‌గా రాణించారని.. ఆయనపై అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయనకు తాను పెద్ద అభిమానిని అని గోయంకా చెప్పుకొచ్చాడు.
 
ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై గోయెంకా స్పందిస్తూ.. జట్టు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. సోషల్ మీడియా ఆధారంగా ధోనీ కెప్టెన్సీ నుంచి పక్కనబెట్టినట్లు అర్థం వచ్చేలా ఆయన తెలిపాడు.

వెబ్దునియా పై చదవండి