ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్మన్, 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ IPL 2025 సీజన్లో రెండు అరుదైన మైలురాళ్లతో రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ముల్లాన్పూర్లో శుక్రవారం రాత్రి గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో, టోర్నమెంట్ చరిత్రలో 7వేల పరుగులు, 300 సిక్సర్లు రెండింటినీ దాటిన రెండవ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు.