ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల తగ్గింపు.. ఫ్లిఫ్‌కార్ట్‌లో సేల్

గురువారం, 6 జూన్ 2019 (16:29 IST)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్‌ ధరను తగ్గించింది. ఒప్పో కె1 స్మార్ట్ ఫోన్ భారత్‌ మార్కెట్లోకి నాలుగు నెలల క్రితం ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించినట్లు సదరు సంస్థ వెల్లడించింది. 
 
ఇందులో భాగంగా రూ.16,990గా వున్న ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ.2వేల వరకు తగ్గించింది. ఫలితంగా రూ.14,990 ధరకు ఈ స్మార్ట్ ఫోన్ ధర తగ్గిందని ఒప్పో ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
తగ్గించిన ధరతో కూడిన ఈ ఒప్పో కె1 స్మార్ట్‌ఫోన్‌ను ఈ-కామర్స్ సైట్ ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆస్ట్రల్ బ్లూ, పియానో పింక్ అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో వుంటుందని ఒప్పో తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు