షియోమీ రెడ్‌మీ నోట్‌ 9.. అమేజాన్‌లో అమ్మకాలు ప్రారంభం

గురువారం, 30 జులై 2020 (12:05 IST)
Redmi Note 9
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ షియోమీ కొత్త బడ్జెట్‌ హ్యాండ్‌సెట్‌ రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్‌ఫోన్‌ జూలైలో భారత్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్‌ 9 ఫోన్ల విక్రయాలు అమేజాన్‌ ఇండియా, ఎంఐ డాట్‌కామ్‌లో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. 
 
రెడ్‌మీ నోట్‌ 9 ప్రొ, నోట్‌ 9 ప్రొ మ్యాక్స్‌ తర్వాత నోట్‌ 9 మోడల్‌ను షియోమీ ఇప్పటికే రిలీజ్‌ చేసింది. క్వాడ్‌ కెమెరా సెటప్‌, 5,020mAh బ్యాటరీ, మీడియాటెక్‌ హీలియో జీ85 ప్రాసెసర్‌ వంటి ఫీచర్లు ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌ మూడు కలర్లు, వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు ప్రస్తుతం ఆన్‌లైన్ దిగ్గజం అమేజాన్‌లో లభించనుంది. అలాగే నాలుగో కలర్ ఆప్షన్ అయిన స్కార్లెట్ రెడ్ ఆగస్టు ఆరో తేదీ నుంచి అమేజాన్ ప్రైమ్ డే సేల్‌లో లభించనుంది.
 
ధరల సంగతికి వస్తే..?
4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11.999
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13.499
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 14.999

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు