నెట్‌వర్క్ కాల్స్-కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పిన జియో.. అయినా ట్రోలింగ్ ఆగలేదు..

ఆదివారం, 13 అక్టోబరు 2019 (13:56 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో... తాజాగా వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే ఫోన్ కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేయబోతున్నామంటూ వినియోగదారులకు ఆ సంస్థ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తతో జియో కస్టమర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో.. జియో ప్రస్తుతం గుడ్ న్యూస్‌తో ముందుకు వచ్చింది. 
 
ఇతర నెట్‌వర్క్‌కు  కాల్స్‌కు సంబంధించి 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. తొలిసారి రీఛార్జ్ చేయించుకున్న ఖాతాదారులకు ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు జియో సంస్థ ప్రకటించింది. 
 
అయితే, రీచార్జ్ ప్లాన్లను ప్రకటించిన తొలి వారం రోజులు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని చెప్పింది.  అంటే తన నెట్‌వర్క్ పరిధిలో కాల్స్‌కి ఫ్రీ అయినా.. ఇతర నెట్‌వర్క్‌లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తుండగా.. ఈ 30 నిమిషాల ఫ్రీ టాక్‌ టైం వారికి వర్తింజేయనుంది. అయితే.. ఈ ఆఫర్‌పై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు