ఐఆర్సీటీసీతో చేతులు కలిపిన స్విగ్గీ.. ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా సేవలు

సెల్వి

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (18:54 IST)
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఫుడ్ డెలివరీ సర్వీస్ అయిన స్విగ్గీ, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)తో భాగస్వామ్యం చేయడం ద్వారా భారతీయ రైల్వేలతో చేతులు కలుపుతోంది. 
 
ఐఆర్సీటీసీ ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా రైలు ప్రయాణీకులకు ప్రీ-ఆర్డర్ చేసిన భోజన డెలివరీ సేవలను అందించడమే లక్ష్యం. ఐఆర్సీటీసీ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అధికారిక ఫైలింగ్ ద్వారా ప్రకటించబడింది. ఈ సహకారం బండ్ల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సులభతరం చేయబడుతుంది.  
 
తొలిదశలో బెంగళూరు, భువనేశ్వర్, విజయవాడ, విశాఖపట్నంతో సహా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. "బండల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్) ద్వారా ఈ-కేటరింగ్ సర్వీస్ త్వరలో అందుబాటులోకి రావచ్చు" అని ఐఆర్సీటీసీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు