అబ్బాయిని అమ్మాయిగా మార్చి.. ఆరు నెలల పాటు..?

శనివారం, 16 జనవరి 2021 (09:27 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలుడికి బలవంతంగా లింగ మార్పిడి చేశారు. ఆపై నలుగురు దుండగులు మూడేళ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ, లక్మీనగర్‌లో జరిగిన డ్యాన్స్‌ కార్యక్రమంలో పరిచయమైన ఒక వ్యక్తి, శిక్షణ ఇస్తానని చెప్పి ఆ బాలుడ్ని తన వెంట తీసుకెళ్లాడు. అనంతరం ఆ బాలుడితో కొన్ని డ్యాన్స్‌ కార్యక్రమాలు ఇప్పించి డబ్బులు సంపాదించాడు.
 
అయితే తన బృందంతో కలిసి డ్యాన్స్‌ చేసి జీవిస్తానని ఆ బాలుడు ఒక రోజు అతడితో చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ బాలుడ్ని నిర్బంధించి కొన్ని రోజులు మత్తుపదార్థాలు ఇచ్చాడు. అనంతరం బలవంతంగా లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించాడు. హార్మోన్‌ ఇంజక్షన్లు కూడా ఇవ్వడంతో ఆ బాలుడి శరీరంలో మార్పులు సంభవించాయి.
 
అనంతరం ఆ వ్యక్తి , ముగ్గురు స్నేహితులు కలిసి కొన్ని ఏళ్లుగా బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద యాచించాలని డిమాండ్‌ చేశారు. ఆ వ్యక్తి కూడా మహిళల దుస్తులు ధరించి రోడ్డుపై కనిపించే వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేసేవాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలుడికి తెలిసిన మరో బాలుడ్ని ఆ వ్యక్తి తీసుకొచ్చాడు.
 
కాగా, గత ఏడాది మార్చిలో కరోనా లాక్‌డౌన్‌ సమయంలో వీరిద్దరు పారిపోయారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌కు వెళ్లి దాక్కున్నారు. ఓ న్యాయవాది సాయంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ)కు అప్పగించారు. అలా ఆ ఇద్దరు కామాంధుల చెర నుంచి బయటపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు